
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్టెక్, కంపెనీలలో ఏజెంటిక్ ఏఐ వాడకాన్ని పెంచడానికి సేల్స్ఫోర్స్తో తమ భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, హెచ్సీఎల్టెక్ కొత్త కన్సల్టేషన్, ఇంప్లిమెంటేషన్ సేవలను ప్రారంభించింది. ఇవి వివిధ పరిశ్రమలలో, ముఖ్యంగా ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, రిటైల్ తయారీ రంగాలలో ఏజెంటిక్ ఏఐను వేగంగా అమలు చేయడానికి సహాయపడతాయి.
హెచ్సీఎల్టెక్ ఎంటర్ప్రైజ్- గ్రేడ్ ఏజెంటిక్ వర్క్ఫ్లోస్ను త్వరగా స్వీకరించడంలో సహాయపడుతుంది. ఈ వర్క్ఫ్లోలు వివిధ సిస్టమ్లలో టాస్క్ ఆర్కెస్ట్రేషన్, రీజనింగ్, యాక్షన్ ఎగ్జిక్యూషన్ను ఏకీకృతం చేస్తాయి. ఫలితంగా మార్కెటింగ్, అమ్మకాలు, సేవలు, కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. నమ్మకమైన ఫలితాలను సాధించడానికి ఏజెంట్ టు -ఏజెంట్, ప్రోటోకాల్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ వంటివి ఉపయోగిస్తోంది. ఏజెంటిక్ ఏఐ మనుషుల అవసరం లేకుండానే సంక్లిష్ట సమస్యలను స్వయంగా పరిష్కరిస్తుంది.