
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సబ్సిడరీ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్తో సహా ఆరు కంపెనీలు ఐపీఓ ద్వారా ఫండ్స్ సేకరించేందుకు సెబీ నుంచి ఆమోదం పొందాయి. విక్రమ్ సోలార్, ఏ వన్ స్టీల్స్ ఇండియా, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, డోర్ఫ్-కెటల్ కెమికల్స్, శ్రీజీ షిప్పింగ్ గ్లోబల్ లిమిటెడ్ త్వరలో ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ఈ ఆరు కంపెనీలు అక్టోబర్ 2024 నుంచి జనవరి 25, 2025 మధ్య సెబీకి ఐపీఓ డ్రాఫ్ట్ పేపర్స్ సబ్మిట్ చేశాయి.
మే 27-–30, 2025 మధ్య సెబీ అబ్జర్వేషన్స్ (ఆమోదం) పొందాయి. హెచ్డీపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓలో రూ. 2,500 కోట్ల ఫ్రెష్ ఈక్విటీ షేర్ల ఇష్యూ, రూ. పది వేల ఆఫర్- ఫర్ -సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించిన ఫండ్స్ను టైర్-I క్యాపిటల్ను బలోపేతానికి, అప్పులు ఇవ్వడానికి, బిజినెస్ వృద్ధికి ఉపయోగిస్తామని హెచ్డీబీ ఫైనాన్షియల్ చెబుతోంది.