
- మాదాపూర్లో యువకుడి మిస్సింగ్
మాదాపూర్, వెలుగు : యువకుడి మిస్సింగ్ ఘటన మాదాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్లోని ఇజ్జత్నగర్కు చెందిన ఉడుత ఎల్లయ్య లేబర్గా పనిచేస్తున్నాడు. అతడి కొడుకు మహేష్(20) బీటెక్ పూర్తి చేశాడు. కొడుకు ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్తానని చెప్పగా.. ఎల్లయ్య గతేడాది అక్టోబర్22న రూ.2 లక్షలు ఇచ్చాడు.
ఆ తర్వాత నుంచి మహేశ్ సెల్ ఫోన్ స్విచాఫ్వస్తుండటంతో ఎల్లయ్య ఇంట్లో కొడుకు వస్తువులను చెక్ చేశాడు. మహేశ్ పాస్పోర్టు ఇంట్లోనే ఉండటంతో అనుమానంతో సోమవారం మాదాపూర్ పీఎస్లో కంప్లయింట్ చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.