రానున్న రెండు రోజులు కీలకం..తమ్మినేని ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల..

రానున్న రెండు రోజులు కీలకం..తమ్మినేని ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల..

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు.  తమ్మినేని వీరభద్రం  చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు తెలిపారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రానున్న రెండు రోజులు కీలకమని వైద్యులు తెలిపారు. 

కాగా, తమ్మినేని వీరభద్రం మంగళవారం రోజున అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. లంగ్స్‌లో నీరునీ వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రసుత్తం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.