రోబోటిక్ సిస్టమ్తో వైద్యంలో పెనుమార్పులు..సర్జరీలు మరింత సులభతరం : మంత్రి దామోదర రాజనర్సింహ

రోబోటిక్ సిస్టమ్తో వైద్యంలో పెనుమార్పులు..సర్జరీలు మరింత సులభతరం : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్​సిటీ,వెలుగు: రోబోటిక్​ సిస్టమ్​తో వైద్య రంగంలో పెనుమార్పులు వస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇండియన్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ గైనకాలజికల్‌‌‌‌ ఎండోస్కోపిస్ట్స్‌‌‌‌ -తెలంగాణ చాప్టర్‌‌‌‌, అబ్స్టెట్రిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ గైనకాలజికల్‌‌‌‌ సొసైటీ ఆఫ్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ సంయుక్తంగా కేర్ హాస్పిటల్స్‌‌‌‌ సహకారంతో తాజ్‌‌‌‌ డెక్కన్‌‌‌‌లో ఆదివారం ‘రోబోటిక్‌‌‌‌ హారిజన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ గైనకాలజీ’ మీటింగ్​ నిర్వహించారు.

 ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. సర్జరీల్లో కచ్చితత్వాన్ని పెంచడంలో, ఆధునిక వైద్యసేవలను ప్రజలకు చేరువ చేయడంలో రోబోటిక్ వ్యవస్థల పాత్ర అమోఘమన్నారు. ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ మంజుల అనగని, బిజునాయర్, డాక్టర్ ఎస్.శాంతకుమారి, డాక్టర్ సుజల్ మున్షి, డాక్టర్ అతుల్ గణత్ర, డాక్టర్ కల్యాణ్ బర్మాడే పాల్గొన్నారు.