కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ వో రాజశ్రీ

కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ వో రాజశ్రీ

ఆర్మూర్, వెలుగు : కుటుంబ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖపై ఉందని డీఎంహెచ్​వో రాజశ్రీ అన్నారు. బుధవారం ఆర్మూర్​లోని ఏరియా హాస్పిటల్​లో ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్ డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

డీఎంహెచ్ వో రాజశ్రీ మాట్లాడుతూ ఈ నెల 18 వరకు ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించాలని చెప్పారు. అధిక సంతానం వల్ల కలిగే అనర్థాలను వివరించాలని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ రమేశ్​, డీఐవో డాక్టర్ అశోక్, ఎంసీహెచ్ ప్రోగ్రామ్ సూపరింటెండెంట్​ సుప్రియ, వెంకటేశ్,  సూపర్​ వైజర్లు, డాక్టర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.