కృష్ణా : తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని మధిరా నుంచి కారులో 2,350 మద్యం సీసాలను విజయవాడకు అక్రమంగా రవాణా చేస్తుండగా నందిగామ వద్ద పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు.
అనుమానం వేసి కారును తనిఖీలు చేయగా డిక్కీ, వెనుక సీటులో మొత్తం కారు నిండా మద్యం కాటన్లు ఉన్నాయని తెలిపారు నందిగామ పోలీసులు. మద్యం తరలిస్తున్న వారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు చెప్పిన పోలీసులు.. మద్యం సీసాలను సీజ్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.