
-
మహిళల భద్రతకు రూ.13,412 కోట్లు
-
కేంద్ర మంత్రి బండి సంజయ్
ఢిల్లీ: దేశంలోని మహిళల భద్రత కోసం కేంద్రం రూ.13 వేల 412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళలు, పిల్లలపై రక్షణపై ఇవాళ పార్లమెంట్లో ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రతకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం కోసం రూ.3375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కోసం రూ.280 కోట్లు, జైళ్ల ఆధునీకరణ కోసం రూ.950 కోట్లు కేటాయించామన్నారు, రాష్ట్ర సైన్స్ ఫోరెన్సిక్ లాబరేటరీల పటిష్టత కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలు, ఫోరెన్సిక్ డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీల ఆధునీకరణకు రూ.354.25 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కోసం రూ.2840 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
శిక్షణ, సామర్ధ్యం పెంపు కోసం రూ.76.5 కోట్లు, పేద ఖైదీల కోసం రూ.60 కోట్లు, మానవ అక్రమ రవాణా నిరోధక (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్) యూనిట్ కోసం రూ.113.76 కోట్లు, మహిళా హెల్ప్ డెస్కుల కోసం రూ.164.2 కోట్లు, చండీఘడ్ లో డీఎన్ఏ ల్యాబ్ ఏర్పాటు కోసం రూ.42.84 కోట్లు, మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాల నియంత్రణ కోసం రూ.224.76 కోట్లు, సెంట్రల్ విక్టిమ్ కాంపోజిషన్ ఫండ్ కోసం రూ.200 కోట్లు, దిల్లీ పోలీస్ స్కీం ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్ , కౌన్సిలర్స్, న్యూ బిల్డింగ్ ఫర్ విమెన్ సెంట్రిక్ ఫెసిలిటీస్ ఫర్ స్పెషల్ నీడ్స్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ కోసం రూ.38.8 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం కోసం రూ.2254 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మొత్తంగా రూ.13,412 కోట్లు మహిళలు. చిన్నారుల కోసం ఖర్చు పెడుతున్నట్లు ఆయన వివరించారు.