
- ఉస్మాన్ సాగర్ 10 గేట్లు 6 అడుగుల వరకు ఓపెన్
- హిమాయత్ సాగర్ 4 గేట్లు 3 అడుగుల వరకు ఎత్తిన అధికారులు
హైదరాబాద్సిటీ, వెలుగు: వర్షాలతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు భారీగా వరద నీరు చేరుతోంది. రెండింటి నుంచి మూసీలోకి 35 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ 13 గేట్లను 9 అడుగుల మేరకు ఎత్తి మూసీలోకి 13500 క్యూసెక్కులను వదులుతున్నారు.
దీని ఎఫ్టీఎల్ 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.15 అడుగుల నీరు ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు 17 ఉండగా శుక్రవారం 9 గేట్లను 5 అడుగుల వరకు ఎత్తారు. ఎఫ్టీఎల్ 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.95 అడుగులకు నీరు చేరింది. దీని ఔట్ఫ్లో 21500 క్యూసెక్కులు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వాటర్ బోర్డు సిబ్బందికి రెండు రోజులు సెలవులు రద్దు చేశారు.