రెయిన్ అలర్ట్: రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షాలు..

రెయిన్ అలర్ట్: రానున్న 3 రోజులు తెలంగాణలో వర్షాలు..

రానున్న 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్నిప్రాంతాలకు భారీ వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ.  2024, జూన్ 10వ తేదీ సోమవారం ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ తెలిపింది. 

ఈ క్రమంలో జూన్ 11వ తేదీ పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు అధికారులు.  

 మాన్సూన్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు హైదరాబాద్ శివార్లతో పాటు జిల్లాల్లో వర్షం పడింది. మేడ్చల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఘట్కేసర్, కీసర మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం పడింది. వర్షం కారణంగా కొన్నిప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పీర్జాదిగూడ, బోడుప్పల్ ఏరియాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.