డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. జాసన్ సంజయ్

డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. జాసన్ సంజయ్

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay)  ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. టాలీవుడ్,కోలీవుడ్ లో అతని మూవీస్ కి స్పెషల్ ట్రెండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం దళపతి హీరో విజయ్ కుమారుడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. విజయ్ లాంటి టాప్ హీరో కొడుకు జాసన్ సంజయ్(Jason Sanjay) హీరోగా కాకుండా.. డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. డెబ్యూ డైరెక్టర్గా ఒక మంచి కంటెంట్ స్టోరీని డైరెక్ట్ చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. 

ఇందుకోసం జాసన్ సంజయ్ ఫస్ట్ మూవీని ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఇవాళ (ఆగస్ట్ 28న) సంజయ్ జాసన్ అగ్గ్రిమెంట్ పేపర్స్పై  సంతకం చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో లైకా షేర్ చేసింది. దీంతో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు షాక్ అయినా..దళపతి విజయ్ కొడుకు అంటే.. మినిమమ్ పవర్ ఉంటుందని సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు.  ప్రస్తుతం సంజయ్ జాసన్ క్రియేటివ్ టీంతో పాటు, నటి నటులను సెలెక్ట్ చేసే వర్క్లో ఉన్నట్లు జాసన్ పేర్కొన్నారు.

జాసన్ సంజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్ (2018-2020)లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా కంప్లీట్ చేసి అటు నుంచి(2020-2022) సం.లో లండన్‌ కెనడాలో స్క్రీన్ రైటింగ్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సును నేర్చుకున్నాడని సమాచారం. 

ఇక విజయ్..డైరెక్టర్ లోకేష్ కనగరాజు డైరెక్షన్లో  మాస్టర్ మూవీ విజయం తర్వాత లియో మూవీ తెరకెక్కిస్తున్నారు. త్రిష హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌‌, సంజయ్‌‌దత్‌‌, ప్రియా ఆనంద్‌‌, మన్సూర్ అలీఖాన్‌‌, గౌతమ్ మీనన్‌‌, మిస్కిన్‌‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.