ధనుష్ ఐశ్వర్య దంపతుల విడాకులు

 ధనుష్ ఐశ్వర్య దంపతుల విడాకులు

తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. దీనిపై ఇద్దరూ విడివిడిగా సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశారు. 18 ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థ చేసుకొని మా ప్రయాణం సాగించాం... ఇప్పుడు వేర్వేరు దారుల్లో నడిచేందుకు సిద్ధమయ్యాం. ఐశ్వర్య నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలనుకుంటున్నాం.. మా నిర్ణాయన్ని గౌరవించి.. వ్యక్తిగత గోప్యత ఇవ్వగలరని.. ధనుష్ ట్విటర్ లో ఉంచిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఐశ్వర్య తన ఇన్ స్టాగ్రామ్ లో అదేలేఖను...ఎలాంటి క్యాప్షన్ అవసరం లేదని.. పరిస్థితిని అర్థం చేసుకోవడం.. ప్రేమ మాత్రమే కావాలని పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యతో.. హీరో ధనుష్ కు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

 

ధనుష్ నటించిన కాదల్ కొండై సినిమా విడుదలైన సమయంలో ఐశ్వర్య.. థియేటర్‎కి వెళ్లి ఆ సినిమాను చూసింది. అదే సమయంలో ఐశ్వర్యను చిత్ర యూనిట్ ధనుష్‎కి పరిచయం చేసింది. బాగా నటించావంటూ ధనుష్ ను ఐశ్వర్య పొగడ్తల్లో ముంచెత్తింది. అంతేకాకుండా ఆ మరుసటి రోజు ధనుష్‎కి బొకే పంపించింది.  ఇంటికి బొకే పంపించి టచ్‌లో ఉండమని చెప్పింది. అక్కడి నుంచి వారిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమతమ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి.. వారి అంగీకారంతో వివాహం చేసుకున్నారు. బంధువుల సమక్షంలో నవంబరు 18, 2004న వీరిద్దరి వివాహం  జరిగింది. ఆ సమయంలో ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. అంతేకాకుండా.. ధనుష్ అప్పటికి ఐశ్వర్య కంటే రెండేళ్లు పెద్దవాడు కావడం గమనార్హం.  వీరి బంధానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు యాత్రా రాజా (15), లింగ రాజా (11) ఉన్నారు.