Akkineni Nagarjuna: ముసలాయన అని చూడకుండా తోసేశారు.. క్షమాపణలు చెప్పిన నాగార్జున

Akkineni Nagarjuna: ముసలాయన అని చూడకుండా తోసేశారు.. క్షమాపణలు చెప్పిన నాగార్జున

 హీరో అక్కినేని నాగార్జున ఒక వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన ఓ సంఘటనపై స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తిని సారీ అడిగారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అక్కినేని నాగార్జున ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కుబేర సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్  ధనుష్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 

ఇందులో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు హీరో ధనుష్, నాగార్జున. నాగార్జున ఎయిర్పోర్ట్ నుండి నడుచుకుంటూ వస్తుండగా.. ఒక ముసలాయన ఆయనతో ఫోటో దిగాలని అతృతతో నాగార్జున వద్దకు వచ్చాడు. దాంతో నాగ్ బాడీగార్డ్స్ ఆ ముసాయాలన్ని పక్కకు తోసేశారు. అది గమనించని నాగార్జున పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. నాగార్జునపై, అతను బాడీగార్డ్స్ పై మండిపడుతున్నారు నెటిజన్స్. మీకు మానవత్వం లేదా.. కనీసం ముసలాయన అని కూడా చూడకుండా అలా తోసేస్తారు. హీరోలైతే ఏంటి? మరీ ఇంత దారుణమా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించరు నాగార్జున.. ఆ సంఘటన గురించి నాకు ఇప్పుడే తెలిసింది. అలా జరిగి ఉండకూడదు. నేను ఆ పెదాయానాకు క్షమాపణలు చెప్తున్నాను. మరోసారి ఇలాంటివి జరుగకుండా చూసుకుంటానుక.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ పోస్ట్ సోసిల్ మీడియాలో వైరల్ గా మారింది.