
సామజవరగమన(Samajavaragamana) సినిమాతో చాలా రోజుల తరువాత సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu). కొత్త దర్శకుడు రామ్ అబ్బరాజు(Ram Abbaraju) తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టి శ్రీవిష్ణుకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఇప్పుడు ఓం భీం బుష్(Om Bheem Bush) అనే మరో కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. హుషారు ఫేమ్ హర్ష కనిగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు.
మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియాలో ముచ్చటించారు మేకర్స్. రిపోర్టర్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తుండగా.. దర్శకుడు హర్ష చేతిలో నుండి మైక్ లాకుంన్నాడు హీరో శ్రీవిష్ణు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఓం బీమ్ బుష్ సినిమా కథ గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నిచగా. దానికి సమాధానంగా దర్శకుడు హర్ష.. ఇందులో పురాతన మంత్రగాళ్ళు అని చెప్పబోయాడు. దాంతో వెంటనే మైక్ లాక్కున్న శ్రీవిష్ణు.. నువ్వు సినిమాలోకి మెయిన్ ఎలిమెంట్స్ అన్నీ ఇప్పుడే చెప్పేస్తున్నావు. వాళ్లేమో తెలివిగా నీ దగ్గర నుండి కథ రివీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు.. నువ్వేమో ఆగడం లేదు.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.