అది ఆమె వ్యక్తిగత హక్కు.. ఎవరూ బలవంతం చేయలేరు

అది ఆమె వ్యక్తిగత హక్కు..  ఎవరూ బలవంతం చేయలేరు

తమిళ స్టార్ విశాల్(Vishal) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ  ‘మార్క్ ఆంటోని(Mark antony)’. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను.. దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్(Adhik Ravichandran) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది యూనిట్. 

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో విశాల్.. మార్క్ ఆంటోనీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanatara) సినిమా ప్రమోషన్స్ కు రాకపోవడంపై విశాల్ ను ప్రశ్నించారు యాంకర్. దానికి బదులుగా విశాల్ మాట్లాడుతూ.. నయనతార ఏ సినిమా ప్రమోషన్స్ కి కూడా రారు. అది ఆమె హక్కు. ఖచ్చితంగా రావాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం హీరో విశాల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక మార్క్ ఆంటోనీ విషయానికి వస్తే.. ఈ సినిమాలో మరో దర్శకుడు ఎస్ జే సూర్య(SJ Surya), సునీల్(Sunil), అభినయ(Abhinaya), రీతూ వర్మ(Ritu varma) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మరి ఈ సినిమా విశాల్ ఎలాంటి విజయాన్ని అందిస్తుంది అనేది తెలియాలంటే సెప్టెంబర్ 19 వరకు ఆగాల్సిందే.