Vishal: నా 25 ఏళ్ళ కల.. హీరో విశాల్ సరికొత్త ప్రయాణం

Vishal: నా 25 ఏళ్ళ కల.. హీరో విశాల్ సరికొత్త ప్రయాణం

తనదైన నటనతో తమిళ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు హీరో విశాల్(Vishal). ఆయన తమిళ స్టార్ అయినప్పటికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది విశాల్ కి. అందుకే ఆయన సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇటీవలే మార్క్ ఆంటోనీ సినిమాతో హిట్ అందుకున్న విశాల్ ప్రస్తుతం రత్నం మూవీ చేస్తున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రియా భావాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా విడుదల చేసిన డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా మచ్చ అనే సాంగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ALSO READ | HanuMan Telugu OTT: ఇది యాపారం.. ఆడియన్స్కు షాకిచ్చిన హనుమాన్ OTT టీమ్

ఇదిలా ఉంటే.. తాజాగా విశాల్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటంటే.. విశాల్ దర్శకుడిగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాడు. ఆయన హీరోగా వచ్చిన తుప్పారివాళన్(డిటెక్టీవ్) సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ కు విశాల్ దర్శకత్వం వచించనున్నాడు. ఇదే విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.. ఇండస్ట్రీలో ఇది నా 25 కల, కొత్త ప్రయాణం మొదలైంది. నా కల, జీవితంలో నేను ఎలా ఉండాలనుకున్నాను అది నిజమైంది. నా కెరీర్‌లో అత్యంత సవాళ్లతో కూడిన బాధ్యతను తీసుకున్నాను. దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. తుప్పరివాలన్‌2 సినిమా కోసం లండన్‌ బయలుదేరాం. ఈ ప్రయాణం గురించి చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. 

నటుడిగా నాకు గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే  కొనసాగుతుందని కోరుకుంటున్నాను. ఈ నా కల ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్‌ సర్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు. అంటూ రాసుకొచ్చాడు విశాల్‌. ప్రస్తుతం ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేస్తున్న విశాల్ ఏమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.