రెడ్‌‌‌‌‌‌‌‌ కార్పెట్‌‌‌‌‌‌‌‌పై... సీతారామం హీరోయిన్​

రెడ్‌‌‌‌‌‌‌‌ కార్పెట్‌‌‌‌‌‌‌‌పై... సీతారామం హీరోయిన్​

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. అంతర్జాతీయ వేదికపై మెరవబోతోంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే అవకాశం ఆమెను వరించింది. ఇందులో పాల్గొనడం ఆమెకు ఇదే ఫస్ట్ టైమ్. దీంతో ఎగ్జయిట్మెంట్‌‌‌‌‌‌‌‌ ఫీల్ అవుతోంది మృణాల్. కేన్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లడం థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని, గ్లోబల్ ఫిల్మ్ మేకర్స్‌‌‌‌‌‌‌‌తో ఇంటరాక్ట్ కాబోతున్నందుకు ఫుల్‌‌‌‌‌‌‌‌ హ్యాపీగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది.

కొత్త అవకాశాలను దక్కించుకోడానికి, తన టాలెంట్‌‌‌‌‌‌‌‌ను చూపించడానికి ఇదో మంచి వేదిక అని, రెడ్ కార్పెట్‌‌‌‌‌‌‌‌పై నడిచే మూమెంట్‌‌‌‌‌‌‌‌ కోసం ఈగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెయిట్ చేస్తున్నానంది మృణాల్. మంగళవారం మొదలైన 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈనెల 27 వరకూ జరగనుంది. మృణాల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మ, అదితిరావు హైదరి, మానుషి చిల్లర్‌‌‌‌‌‌‌‌, సారా అలీఖాన్‌‌‌‌‌‌‌‌, ఈషా గుప్తా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో నానికి జంటగా నటిస్తున్న మృణాల్.. హిందీలో పూజా మెరీ జాన్‌‌‌‌‌‌‌‌, పిప్పా, ఆంఖ్‌‌‌‌‌‌‌‌ మిచోలి సినిమాల్లో నటిస్తోంది.