ఒంటరిగా బ్రతికితేనే దాని విలువ తెలుస్తుంది: సమంత

ఒంటరిగా బ్రతికితేనే దాని విలువ తెలుస్తుంది: సమంత

గత కొంత కాలంగా మాయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్న సమంత(Samantha) కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె తన అమ్మతో కలిసి అమెరికాకు వెళ్ళింది. మాయోసైటిస్ వ్యాధి చికిత్స కోసమే సమంత అక్కడికి వవెళ్లిందని సమాచారం. ఇక ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా సమంత చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. మీకు ఎప్పుడైనా ఒంటరిగా బతికే అవకాశం వచ్చినా, నడిచే అవకాశం వచ్చినా, ప్రయాణించే అవకాశం వచ్చినా, డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినా అస్సలు వదులుకోకండి. మీకు ఎం చేయాలనిపిస్తే అది చేసేయండి. నిన్ను నిన్నులా ఈ సమాజం ఒప్పుకోకపోతే.. అలా ఒంటరిగానే ప్రయాణించు. నిన్ను నువ్వు నమ్ముకో, అన్వేషించుకో. అప్పుడే మీకు జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది.. తెలుస్తుంది’’ అంటూ ఓక కొటేషన్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.