SHARWANAND35: రన్ రాజా రన్ జోడీ రెడీ..డైరెక్టర్ ఎవరంటే?

SHARWANAND35: రన్ రాజా రన్ జోడీ రెడీ..డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్(Sharwanand) ఒకరు. లేటెస్ట్ గా శర్వా కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మూవీలో శర్వానంద్ నటిస్తున్నారు. ఈ మూవీలో శర్వాకి జోడీగా హిందీ నటి సీరత్ కపూర్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. 

అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన రన్ రాజా రన్ మంచి సక్సెస్ అందుకుంది.దాదాపు తొమ్మిదేళ్ల తరువాత శర్వానంద్, సీరత్ కపూర్ మళ్ళీ ఒక సినిమాలో యాక్ట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సీరత్ కపూర్ రన్ రాజా రన్ తర్వాత బాలీవుడ్లో బిజీ నటిగా మారింది. ఇప్పుడు  తెలుగులో హిట్ పెయిర్ తో రీ ఎంట్రీ ఇస్తుండటంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ శర్వానంద్ 35వ మూవీగా రాబోతుంది. 

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీని  ఒక నవల పాయింట్‌తో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టిజి విశ్వ ప్రసాద్..సహా నిర్మాతగా వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం టాలెంటెడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారు. 

మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్ వాహబ్ నుంచి వచ్చిన ఖుషి మూవీ సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్గా నిలిచినా విషయం తెలిసందే. దీంతో అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ గా మారబోతున్నారు. ఇక ఈ చిత్రానికి DOP విష్ణు శర్మ, ఎడిటర్గా ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ గా జానీ షేక్ వర్క్ చేయబోతున్నారు.  

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. భలే మంచి రోజు మూవీతో ఇండస్ట్రీ డీసెంట్ హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత డైరెక్ట్ చేసిన శమంతకమణి, అలాగే నాగార్జున,నాని లతో ముల్టీస్టార్ర్ర్   దేవదాసు చిత్రాలతో యావరేజ్ అనిపించుకున్నారు. ఇక ఆదిత్య గత చిత్రం హీరో డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా శర్వానంద్ తో  హిట్ కొట్టాలని  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్ తీస్తున్నట్లు తెలుస్తుంది.