GHMC ఎన్నికల పై స్టే ఇవ్వలేం: హైకోర్టు

GHMC ఎన్నికల పై స్టే ఇవ్వలేం: హైకోర్టు

GHMC ఎన్నికలపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే విచారణ జరిపేందుకు తమకు అభ్యంతరం లేదని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, GHMC కి నోటీసులు జారీ చేసింది. GHMC  ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ అభ్యర్థనతో కోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను, గుర్తించే ప్రక్రియ లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. MBCలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్‌ ఇవ్వబోయే సమయంలో బీసీల అంశం ఎందుకు గుర్తొచ్చింది.. రాజకీయ దురుద్దేశంతోనే పిల్‌ దాఖలు చేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కావాలంటే పిల్ పై విచారణ జరపగలమేమో కానీ, ఎన్నికలు ఆపాలంటూ స్టే ఇవ్వడం మాత్రం కుదరని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 2015, 2016లో దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది.