
- హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
- కూకట్పల్లిలో కోర్టు కాంప్లెక్స్ ఓపెనింగ్
కూకట్పల్లి, వెలుగు : కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించుకోవాలని, రాష్ట్ర హైకోర్టు చీఫ్జస్టిస్అలోక్అరాధే న్యాయమూర్తులు, సిబ్బందికి సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వివాదాలకు తావు లేకుండా తీర్పులు ఇస్తేనే కోర్టులపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. కూకట్పల్లి హౌసింగ్బోర్డు కాలనీలో కొత్తగా ధర్మశాల పేరుతో నిర్మించిన మేడ్చల్జిల్లాలోని కూకట్పల్లి, బాలానగర్, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి సివిల్, ఫ్యామిలీ, క్రిమినల్కోర్టుల కాంప్లెక్స్ ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
వీలైనంత త్వరగా తీర్పులను వెల్లడించినప్పుడే కక్షిదారులకు న్యాయం జరినట్టు భావిస్తారని అన్నారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్లక్ష్మణ్, జస్టిస్విజయసేన్రెడ్డి, జస్టిస్శ్యామ్ఖోస్, జస్టిస్ అభినందన కుమార్శావలి, జస్టిస్వినోద్కుమార్, జస్టిస్బాలభాస్కర్, జస్టిస్శశిధర్రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్గౌతమ్పోట్రు, సైబరాబాద్ పోలీసు కమిషనర్అవినాశ్మహంతి, మేడ్చల్అడిషనల్ కలెక్టర్ విజయేందర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.