
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికను సవాలు చేస్తూ మహ్మద్ అజారుద్దీన్, నవీన్ యాదవ్ వేర్వేరుగా దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్లపై హైకోర్టు విచారణను మూసివేసింది. ఇటీవల మాగంటి మరణించడంతో ఈపీలపై విచారణ అవసరం లేదని జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈపీలను కొట్టివేయాలంటూ గోపీనాథ్ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా సానుకూల ఉత్తర్వులు లభించలేదు. ఎన్నికల పిటిషన్లో ప్రాథమిక ఆధారాలున్నందున తిరస్కరించలేమని కోర్టులు చెప్పాయి. ఈ దశలో ఈపీలు మంగళవారం హైకోర్టు విచారణకు వచ్చాయి. తాజాగా మాగంటి అనారోగ్యంతో మరణించడంతో వాటిపై విచారణ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.