హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు షాక్..వ్యూహం నిలుపుదల..

హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు షాక్..వ్యూహం నిలుపుదల..

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. వ్యూహం సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ ఇచ్చింది. సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేష్ వేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలుపుదల చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లో మళ్ళీ రివ్యూ చేసి రీపోర్ట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డ్ కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వ్యూహం సినిమాను రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు పలు మార్లు వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు సోమవారం రోజు తీర్పు ఇచ్చింది. సినిమా పై మరోసారి రివ్యూ జరపాలని సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా విడుదలు బ్రేక్ పడినట్టైంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ లో ఓ భాగమని ఈ సినిమా పై పలు గుసగుసలు వినిపించాయి. ఇందులో పలు సన్నివేశాల్లో అవాస్తవం ఉందని టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.