హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 2010 నుంచి పెండింగులో ఉన్న పిల్స్ పై విచారించింది. సోమవారం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. పదేళ్ళ నుంచి ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. విద్యా హక్కు చట్టం అమలవుతుందా లేదా అని ప్రశ్నించడంతో.. నిధులు, ఖర్చులు వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి చెప్పడంలేదని తెలిపింది. దీంతో.. బడ్జెట్ వివాదాలను ఈనెల 17లోగా పరిష్కరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఈనెల 18న తుది విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు.
