ఉస్మానియా ఆస్పత్రికి మరమ్మతులు చేస్తే హెరిటేజ్ కట్టడానికి దెబ్బ

 ఉస్మానియా ఆస్పత్రికి మరమ్మతులు చేస్తే హెరిటేజ్ కట్టడానికి దెబ్బ

ఉస్మానియా భవనం ఆస్పత్రికి పనికిరాదని నిపుణుల కమిటీ హైకోర్టుకు నివేదించింది. మరమ్మతులు చేసినా ఆస్పత్రి కాకుండా ఇతర అవసరాలకే వినియోగించుకోవచ్చని తెలిపింది. ఆస్పత్రిగా వాడాలంటే ఆక్సిజన్, మంచినీరు, సివరేజీ, గ్యాస్ పైప్ లైన్లు వేయాల్సి ఉంటుందని కమిటీ వెల్లడించింది. ఆస్పత్రికి అవసరమైన మరమ్మతులు చేస్తే భవనం హెరిటేజ్ దెబ్బతింటుందని పేర్కొంది. 

ఈ మేరకు నిపుణుల కమిటీ నివేదికను అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించింది.నిపుణుల కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు గడువు కావాలని ఏజీ కోరారు. అయితే ఈ నివేదికపై పిటిషన్లు అధ్యయనం చేశాక విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి భవనంపై విచారణను ఆగష్టు 25కి హైకోర్టు వాయిదా వేసింది.