హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ప్రాణాలర్పించిన కీర్తి చక్ర అవార్డు గ్రహీత భార్యకు ఇంటి జాగ ఇచ్చేందుకు ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి స్థలం ఇస్తామని జీవో ఇచ్చి 12 ఏండ్లు అయిందని, ఇప్పుడు మళ్లీ 3 నెలలు టైమ్ కావాలని కోరడమేంటని నిలదీసింది. 3 నెలలు కాదని, 3 వారాల్లోనే వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని తేల్చి చెప్పింది. ఆప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్లో ఇండియన్ ఎంబసీపై 2008లో తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో మృతి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వాడపల్లి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా 2014లో జీవో జారీ అయింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ భరణి లే ఔట్లో 475 గజాల స్థలం ఇస్తామని జీవోలో సర్కారు పేర్కొంది. ఏండ్లు గడుస్తున్నా స్థలం ఇవ్వడం లేదని వెంకటేశ్వరరావు భార్య మాలతీరావు హైకోర్టుకు రాసిన లేఖను రిట్ పిటిషన్గా తీసుకొని కోర్టు విచారించింది. వీరుడి కుటుంబాన్ని ఆఫీసుల చుట్ట తిప్పుకోకూడదన్న కోర్టు.. ఆగస్టు 23న జరిగే విచారణ నాటికి బాధితురాలికి ఇంటి స్థలం పట్టా ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.
వీర జవాన్ కుటుంబానికి 12 ఏండ్లయినా జాగ ఇయ్యరా?
- తెలంగాణం
- July 28, 2021
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్