హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ)కి హైకోర్టు షాక్ ఇచ్చింది. బోర్డు ఉద్యోగులు, అధికారులు ఇన్సెంటివ్ల రూపంలో పొందిన మొత్తం రిక వరీ చేయాలని చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. కేఆర్ఎంబీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల బేసిక్పై 25% ఇన్సెంటి వ్గా ఇస్తున్నారు. 2020 నవంబర్ నుంచి ఈ ఇన్సెంటివ్లు పొందుతున్నారు.
ఇలా 26 నెలల్లో ఉద్యోగులు పొందిన మొత్తాన్ని ఏకకాలంలో రికవరీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారుల ఒత్తిడితో చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులు పొందిన ఇన్సెంటివ్లు తిరిగి చెల్లించాల్సి వస్తే కనిష్టంగా రూ.8 లక్షలు, గరిష్టంగా రూ.12 లక్షలు రీ పేమెంట్చేయాల్సి ఉంటుంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఏకకాలంలో ఇన్సెంటివ్లు తిరిగి చెల్లించాలనే ఆదేశాలు రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.