- ట్రాన్స్కో, మూడు డిస్కమ్ల సీఎండీలకూ మెంబర్లుగా చాన్స్
- ఆస్తులు, అప్పులు, అధికారాలు, ఉద్యోగుల బదలాయింపుపై సర్కారుకు నివేదిక
హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కమ్పై ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ప్రభుత్వం హై లెవల్ కమిటీ వేసింది. సభ్యులుగా ఎనర్జీ, ఫైనాన్స్, లా సెక్రటరీలు, ట్రాన్స్కోతో పాటు సదరన్, నార్తర్న్, రైతు డిస్కమ్ సీఎండీలను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు జీవో నంబర్ 21 విడుదల చేశారు.
తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఆర్పీడీసీఎల్) కార్యాచరణ కోసం ఆస్తులు, అప్పులు, మానవవనరులు, నెట్వర్క్, పీపీఏలపై అధ్యయనం చేసి బదలాయింపునకు సంబంధించి సర్కారుకు నివేదిక ఇవ్వనున్నట్టు సీఎస్తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ అందించే సర్వీస్ కనెక్షన్లతో పాటు నీటి పారుదల శాఖ, హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథకు సంబంధించిన సుమారు 30 లక్షల విద్యుత్ కనెక్షన్లను రైతు డిస్కమ్ లోకి మార్చుతూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
కంపెనీల చట్టం ప్రకారం రైతు డిస్కమ్కు సీఎండీతో పాటు డైరెక్టర్లను నియమించింది. ప్రభుత్వ షేర్లను ప్రకటించింది. తెలంగాణ ఈఆర్సీ సైతం ఇటీవల రైతు డిస్కమ్కు లైసెన్స్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రైతు డిస్కమ్ సేవలు అధికారికంగా ప్రారంభించడానికి గతంలో ఎనర్జీ శాఖ పరిధిలోని వివిధ డిస్కమ్లు, ట్రాన్స్కో పరిధిలో ఉన్న ఆస్తులు, అప్పులు, మానవ వనరుల విభజన వంటి వాటిని పారదర్శకంగా చేపట్టే బాధ్యతలను ఈ ఉన్నత స్థాయి కమిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నది.
