విద్యార్థుల ఆందోళన.. వరంగల్లో ఉద్రిక్తత

విద్యార్థుల ఆందోళన.. వరంగల్లో ఉద్రిక్తత

వరంగల్ జిల్లా పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేయూ పీహెచ్ డీ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.

ఉదయం గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు విద్యార్థి సంఘం నేతలు. చేతులకు సంకెళ్లు, తలకు నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలిపారు . కేయూ  వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.11  గంటలలోపు  వీసీ రిజిస్ట్రార్ స్పందించకపోతే 12 గంటలకు తమకు తాము ఆత్మార్పణ  చేసుకుంటామని హెచ్చరించారు కేయూ విద్యార్థులు.

Also Read :- మహాత్మా గాంధీ ఆదర్శంతోనే తెలంగాణలో కేసీఆర్ పాలన