హైదరాబాద్ త్రీడీ మాస్టర్ ప్లాన్-2050.. సిటీలోని ప్రతి అంగుళం రియల్ టైమ్ ఇన్ఫోతో మ్యాపింగ్

హైదరాబాద్ త్రీడీ మాస్టర్ ప్లాన్-2050.. సిటీలోని ప్రతి అంగుళం రియల్ టైమ్ ఇన్ఫోతో మ్యాపింగ్
  • ప్రతి అంగుళం రియల్​ టైమ్ ఇన్ఫోతో మ్యాపింగ్
  •     ప్రతి అంగుళాన్ని రియల్​ టైమ్ ఇన్ఫోతో మ్యాపింగ్​ చేయొచ్చు
  •     ప్రభుత్వ భూముల రక్షణ ఈజీ 
  •     కన్సల్టెన్సీ నియామకానికి టెండర్లు  

హైదరాబాద్​సిటీ, వెలుగు: కొత్తగా విస్తరించిన మహానగరంలోని ప్రాంతాన్నింటితో కలిసి హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్​ప్లాన్​–2050 ప్రక్రియలో త్రీడీ డిజిటల్​ట్విన్​ టెక్నాలజీ వినియోగించాని అధికారులు నిర్ణయించారు. దీంతో నగరంలోని ప్రతి అంగుళాన్ని రియల్ టైమ్ సమాచారంతో లింక్​చేసి మ్యాపింగ్ తయారే చేయొచ్చు. హెచ్ఎండీఏ పరిధి 7,652 చ. కి.మీ. నుంచి 11,052 చ.కి.మీ. విస్తరించిన నేపథ్యంలో 2050 టార్గెట్​గా హెచ్ఎండీఏ మెగా మాస్టర్​ప్లాన్​కు రూపకల్పన చేస్తోంది. 

జోన్ల వారీగా సిటీని విస్తరించడం, చెరువులను కాపాడడం, గ్రీనరీ ఏర్పాటు, పెరుగుతున్న ట్రాఫిక్​ సమస్యలు తప్పించడం, పబ్లిక్​ట్రాన్స్​పోర్టేషన్​మెరుగుపర్చడం వంటి అనేక అంశాలను మాస్టర్​ప్లాన్​లో పొందుపరుస్తారు. ఈ ఏడాది డిసెంబర్​నాటికి డ్రాఫ్ట్​మాస్టర్​ప్లాన్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, త్రీడి డిజిటల్​ట్విన్​టెక్నాలజీ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే కన్సల్టెన్సీ నియమించేందుకు టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు తెలిపారు. 

  • ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా

త్రీడీ డిజిటల్​ట్విన్​టెక్నాలజీతో భవిష్యత్​లో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ప్లాన్లు రూపొందించుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ భూముల పరిరక్షణ, పర్యవేక్షణ, అక్రమ నిర్మాణాల పై నిఘా పెంచడానికి చాన్స్​ఉంటుందంటున్నారు. కన్​స్ట్రక్షన్స్​తీసుకున్న అనుమతుల ప్రకారమే జరుగుతుందా లేదా అన్నది పర్యవేక్షించవచ్చంటున్నారు. రోడ్లు ఆక్రమణలు, విస్తరణ, ఇవన్నీ కూడా డిజిటల్​డేటాతో పోల్చి చర్యలు తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో సిటీలోని ప్రభుత్వ భూములను డిజిటల్ గా రికార్డు చేయొచ్చు.

  • ఏంటీ​ టెక్నాలజీ

త్రీడీ డిజిటల్ ట్విన్​టెక్నాలజీ అంటే నగర ప్రతి రూపాన్ని సృష్టించే లేటెస్ట్​టెక్నాలజీ. నగరంలోని రోడ్లు, బిల్డింగులు, డ్రైనేజీ సిస్టమ్, వాటర్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, ట్రాఫిక్​ ఇలా అన్ని అంశాలను డిజిటల్​ ప్లాట్​ఫామ్ పై త్రీడీ రూపంలో పొందుపర్చి రియల్​ టైమ్​సమాచారంతో లింక్​చేయడం, దీని కోసం లైడర్ సర్వే చేసి నగర రూపురేఖలను తయారు చేస్తారు. డ్రోన్లు, శాటిలైట్​ఇమేజెస్, జీఐఎస్​, ఏఐ టెక్నాలజీతో డిజిటల్​మ్యాప్​రూపొందిస్తారు. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ప్రాంతం వెడల్పు, పొడవు, ఎత్తులను త్రీడీలో మ్యాపింగ్​చేస్తారు. దీనివల్ల ఓఆర్ఆర్​వరకూ సిటీలోని ప్రతి చోటును రియల్​ టైమ్​లో ఉన్నది ఉన్నట్టుగా చూడొచ్చు.