
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని హైకింగ్ ట్రయల్ పార్క్ సుందరీకరణ పనులు చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి పార్కును పరిశీలించారు. పార్కు డెవలప్మెంట్, సుందరీకరణ ప్లాన్ లో మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. ఈఈ విజయకుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ బాలయ్య పాల్గొన్నారు.