
హైదరాబాద్, వెలుగు: హిల్టన్ హోటల్స్ ఢిల్లీలోని ఏరో సిటీలో రెండు హోటల్స్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం జీఎంఆర్ గ్రూప్కు చెందిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. వీటిలో 150 రూములు, సూట్లు, ఈవెంట్స్ కోసం అతిపెద్ద స్థలం, స్పా వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ప్రస్తుత ప్రాజెక్టులతో దక్షిణాసియాలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తున్నట్టు సీఈవో క్రిస్ నసట్టే చెప్పారు. భారతదేశంలో హోటల్స్సంఖ్యను పెంచుతామని చెప్పారు.