జంట జలాశయాల గేట్లు ఓపెన్

జంట జలాశయాల గేట్లు ఓపెన్

గండిపేట, వెలుగు: సిటీ జంట జలాశయాలైన హిమాయత్​సాగర్‌‌‌‌, ఉస్మాన్ సాగర్​కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఈ జలాశయాలకు వరద నీరు పెరుగుతోంది. దీంతో జలమండలి అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి  వదిలిపెట్టారు. ఉస్మాన్​సాగర్​ ఫుల్​ట్యాంక్​ లెవల్​ 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,789.90 అడుగుల నీరు చేరింది. 

హిమాయత్​సాగర్​ ఫుల్​ట్యాంక్​ లెవెల్​ 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1,763.50 అడుగులు నీటి నిల్వ ఉంది. ఈ క్రమంలోనే బుధవారం హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి 1,365 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్లు ఎత్తి 460 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.