రూ.8 వేల కోట్లు పెట్టుబడి పెడతాం: హిందాల్కో

రూ.8 వేల కోట్లు పెట్టుబడి పెడతాం: హిందాల్కో

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్  కంపెనీ హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  రూ.7,500 కోట్ల నుంచి రూ.8 వేల కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. గత ఫైనాన్షియల్ ఇయర్‌‌‌‌లో కంపెనీ క్యాపిటల్ ఎక్స్‌‌‌‌పెండిచర్ రూ.6,500 కోట్లుగా ఉంది. మార్చి 2025తో ముగిసిన క్వార్టర్‌‌‌‌లో హిందాల్కో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 66శాతం పెరిగి రూ.5,284 కోట్లకు చేరింది. 

ఇండియా బిజినెస్‌‌‌‌ మంచి పనితీరు కనబరచడం, అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు, ముడిసరుకుల ధరలు తగ్గడం కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది.  గత ఏడాది ఇదే టైమ్‌‌‌‌లో కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్‌‌‌‌ ప్రాఫిట్ రూ.3,174 కోట్లుగా ఉంది. రెవెన్యూ  రూ.55,994 కోట్ల నుంచి రూ.64,890 కోట్లకు పెరిగింది. మొత్తం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ.16,002 కోట్ల నికర లాభం రాగా,  రూ.2,38,496 కోట్ల రెవెన్యూ వచ్చింది.