ఉప్పల్ భగాయత్ లో మరోసారి ప్లాట్ల వేలం.. గజానికి రూ.35 వేలు

ఉప్పల్ భగాయత్ లో మరోసారి  ప్లాట్ల వేలం.. గజానికి రూ.35 వేలు

ఉప్పల్ భగాయత్ లేఔట్ లో మిగిలి పోయిన ప్లాట్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్ఎండిఏ. 63 ప్లాట్లను వేలానికి పెట్టింది. ఉప్పల్ భగాయత్ లో  464  గజాల నుండి 11,374 గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. జూన్ 27 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఇచ్చింది హెచ్ఎండీఏ, 28 వరకు ఈఎండీ చెల్లించడానికి అవకాశం ఇచ్చింది. జూన్ 13న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నారు అధికారులు.  జూన్ 30న ప్లాట్లను వేలం వేయనున్నారు . ఒక్కో గజానికి  ప్రభుత్వం రూ.35 వేలు నిర్దేశించింది.  అధికారులు భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

గత వేలంతో ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఎన్ఆర్ఐలు సైతం పోటీ పడి ప్లాట్లు కొనుగోలు చేశారు. గజానికి లక్షా 60 వేల వరకు పలికింది.  అయితే ఈ సారి 111 జీవో ఎఫెక్ట్ తో ఆ స్థాయిలో రేటు వస్తుందా లేదా అని అధికారులు ఆలోచనలో పడ్డారు. రీసెంట్ గా బాచుపల్లి, మేడిపల్లిలో సెకండ్ ఫేజ్ ప్లాట్ల వేలంలో ప్లాట్లు అమ్ముడుపోలేదు. త్వరలోనే కోకాపేట భూములకు వేలం వెయ్యడానికి రెడీ చేస్తున్నారు. హెచ్ఎండీఏ అధికారులు