ఇండియా విమెన్స్‌‌‌‌ హాకీ జట్టు కోచ్‌‌‌‌గా మళ్లీ మరైనె

ఇండియా విమెన్స్‌‌‌‌ హాకీ జట్టు కోచ్‌‌‌‌గా మళ్లీ మరైనె

న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్‌‌‌‌ హాకీ జట్టు చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా నెదర్లాండ్స్‌‌‌‌కు చెందిన షోర్డ్‌‌‌‌ మరైనెను తిరిగి నియమించారు. హరేంద్ర సింగ్‌‌‌‌ స్థానంలో తను బాధ్యతలు చేపట్టనున్నాడు. ఐదేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో టీమిండియా నాలుగో ప్లేస్‌‌‌‌లో నిలవడంలో షోర్డ్‌ కీలక పాత్ర పోషించాడు. 

2017 నుంచి 2021 వరకు టీమిండియాను నడిపించిన 51 ఏండ్ల మరైనెకు తోడుగా మతియాస్‌‌‌‌ విలాను అనలైటిక్‌‌‌‌ కోచ్‌‌‌‌గా తీసుకున్నారు. ఈ ఇద్దరితో పాటు వేన్‌‌‌‌ లాంబార్డ్‌‌‌‌ (సౌతాఫ్రికా)ను సైంటిఫిక్‌‌‌‌ అడ్వైజర్‌‌, అథ్లెటిక్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ హెడ్‌‌‌‌గా నియమించారు.