హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని, వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులపై అంశంపై పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ... మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం బ్రాండ్ ఇమేజ్ కలిగి ఉందని, ఈ విషయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. పోలీస్ కమిషనరేట్లు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి పొందిన లైసెన్స్ల ఆధారంగా పబ్లు, బార్లు మొదలైనవాటిని నడుపుతున్నామని, ఇందులో పోలీసుల పాత్ర సున్నా అని మహమూద్ అలీ అన్నారు. కొన్ని ఆంక్షలు లేదా నియంత్రణ ఉల్లంఘనలను అమలు చేస్తున్నప్పుడు చట్టపరమైన వివాదాలు తలెత్తకుండా పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు హోం మంత్రి తెలిపారు. విద్యా సంస్థలు, పాఠశాలలు యాజమాన్యాల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సీఐడీ డీజి గోవింద్ సింగ్, సీపీ సీవీ ఆనంద్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
- హైదరాబాద్
- June 9, 2022
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు