హుక్కా ఫ్లేవర్ల దొంగలు అరెస్ట్

హుక్కా ఫ్లేవర్ల దొంగలు అరెస్ట్

జల్సాలకు అలవాటుపడి హుక్కా ఫ్లేవర్లు దొంగిలించి అమ్ముతున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 2లక్షల 30వేల విలువైన హుక్కా ఫ్లేవర్లు, ఒక ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, 3సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

అర్ధరాత్రి దుకాణాలు మూసివేసిన తరువాత మాటు వేసి.. షెటర్ల తాళాలు పగులగొట్టి విలువైన వివిధ రకాల హుక్కా పదార్థాలను ముఠా దొంగిలిస్తు్న్నారని పోలీసులు తెలిపారు. 

ఎం. జె మార్కెట్ లోని గత సెప్టెంబర్ 29న అగర్వాల్ ఛాంబర్ ట్రూప్ బజార్ లోని ఓ హుక్కా షాపులో ముఠా దొంగతనానికి పాల్పడ్డారని అదే సమయంలో.. దొంగిలించిన హుక్కా ఫ్లేవర్స్ అమ్ముతున్న ముఠాను పట్టుకున్నామని తెలిపారు. 

నిందితులు..

A1. మొహమ్మద్ ఇర్ఫాన్
A2. మొహమ్మద్ సోహైల్,
A3. మొహమ్మద్ మసూద్
A4. మొహమ్మద్ అథేర్
లుగా పోలీసులు గుర్తించారు. 

ముఠాలోని సభ్యులందరూ చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన వారని.. ముఠాలోని ప్రధాన నిందితుడు  A1 గతంలో కాచిగుడా పోలీసుస్టేషన్ లో పలు కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.