పేషెంట్లు ఎక్కువొస్తరు.. అలర్ట్ గా ఉండండి..కలెక్టర్ హరిచందన

పేషెంట్లు ఎక్కువొస్తరు.. అలర్ట్ గా ఉండండి..కలెక్టర్ హరిచందన

హైదరాబాద్ సిటీ, వెలుగు: చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ హరి చందన విజిట్​చేశారు. వర్షాలు పడుతున్నందున దవాఖానాలకు ఎక్కువ మంది రోగులు వచ్చే అవకాశం ఉందని, అలర్ట్​గా ఉండాలన్నారు. పీహెచ్ సీల్లో మందులు కొరత లేకుండా చూడాలన్నారు. చిన్నపిల్లలకు వంద శాతం ఇమ్యునైజేషన్ అందాలని సూచించారు. ఏఎన్ఎంలతో ఇంటింటి  ఫీవర్ సర్వే పక్కాగా చేయించాలన్నారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రోగులతో మాట్లాడారు. వార్డులు, ఓపీ విభాగం, యునాని విభాగాన్ని పరిశీలించారు. డిప్యూటీ డీఎంహెచ్​వో  డాక్టర్ హేమలత, డాక్టర్ రుక్సానా పర్వీన్ పాల్గొన్నారు.


ఆయుష్​ డాక్టర్లు అల్లోపతి వైద్యం చేస్తున్నరు


జిల్లాలో పర్మిషన్​లేని హాస్పిటల్స్​పై యాక్షన్​ తీసుకోవాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి రిజిస్టరింగ్ అథారిటీ కమిటీ సమావేశంలో అడిషనల్​కలెక్టర్ కదిరవన్ పలని, డీసీపీ డాక్టర్ లావణ్య తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జాయింట్ ఆపరేషన్స్​చేసి పోలీస్ అధికారులతో ఎస్​పీహెచ్​వోలు పర్మిషన్లు లేని దవాఖానలపై కేసులు నమోదు చేయాలన్నారు. ఆయుష్​డాక్టర్లు అల్లోపతి ట్రీట్​మెంట్​ చేస్తున్నారని, తనిఖీలు చేయాలని ఆదేశించారు.