షారుఖ్ ఖాన్‌ నాకు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిండు: అస్సాం సీఎం

షారుఖ్ ఖాన్‌ నాకు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిండు: అస్సాం సీఎం

అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని శర్మ ట్వీట్ చేసి చెప్పారు. తన రాబోయే చిత్రం పఠాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మాట్లాడారన్నారు. అతని సినిమా ప్రదర్శన సమయంలో గౌహతిలో జరిగిన సంఘటనను గురించి షారుఖ్ ఆందోళన చేశారని చెప్పారు. కానీ శాంతి, భద్రతలను కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తనకు చెప్పినట్టు అస్సాం సీఎం వెల్లడించారు. ఈ విషయంపై తాము విచారిస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి అని ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

దీని కంటే ముందు సినిమాకి వ్యతిరేకంగా రైట్‌వింగ్ కార్యకర్తలు చేస్తున్న హింసాత్మక నిరసనలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం శర్మ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. "షారుఖ్ ఖాన్ ఎవరు? తనకు అతని గురించి, 'పఠాన్' చిత్రం గురించి ఏమీ తెలియదు" అని శర్మ గౌహతిలో చెప్పారు. ఈ విషయంపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు తనకు కాల్ చేశారని, కానీ షారుఖ్ మాత్రం ఫోన్ చేయలేదన్నారు. దాంతో పాటు అస్సాం ప్రజలు అస్సామీల గురించి మాత్రమే ఆందోళన చెందాలని.. బాలీవుడ్ సినిమాల గురించి కాదని తెలిపారు.