కులాంతర వివాహం చేసుకుండని ఇల్లు కాల్చేసిండ్రు

కులాంతర వివాహం చేసుకుండని ఇల్లు కాల్చేసిండ్రు

యువకుడి ఇల్లు కాల్చేసిన బాలిక కుటుంబీకులు

యాదగిరిగుట్ట, వెలుగు: బాలికను కులాంతర వివాహం చేసుకోవడంతో.. అబ్బాయి ఇల్లును బాలిక తల్లిదండ్రులు దహనం చేశారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన వేముల భాను గౌడ్(28) అదే గ్రామానికి చెందిన బాలికను(16) ప్రేమిస్తున్నాడు. శుక్రవారం ఆమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. తమ అమ్మాయి కనిపించడం లేదని బాలిక పేరెంట్స్ తుర్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఫొటోలను అబ్బాయి సోషల్ మీడియాలో పోస్ట్​ చేయడంతో బాలిక తల్లిదండ్రులు, బంధువులకు విషయం తెలిసింది. శనివారం వారంతా వెళ్లి అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. యువకుడి  పేరెంట్స్ ఫిర్యాదు మేరకు బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. మైనర్​ను పెళ్లి చేసుకున్నందుకు భానుపై పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టారు.