
మెహిదీపట్నం, వెలుగు: ఓ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ తన కూతురు చదువు కోసం యజమాని ఇంటికే కన్నం వేసింది. ఆమెను పోలీసులు అరెస్ట్చేశారు. టోలిచౌకి ఏసీపీ సయ్యద్ఫయాజ్తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి నిజాం కాలనీకి చెందిన మీర్ షఫీ అలీఖాన్ ఇంట్లో ఇదే ప్రాంతానికి చెందిన సబియా బేగం 20 ఏండ్లుగా పని మనిషిగా చేస్తోంది.
గత నెల 20న ఇంట్లోని 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని అలీఖాన్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే గురువారం సబియా బేగం నగలు విక్రయించేందుకు స్థానిక ఓ జ్యువెలరీ షాప్కు వెళ్లింది.
ఆ షాప్యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ రమేశ్తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. సబియా బేగంను అదుపులోకి తీసుకొని, ఆమె వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కూతురు ఇంజినీరింగ్ చదువు కోసం ఈ చోరీ చేసినట్లు చెప్పింది. నిందితురాలిని అరెస్ట్చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు.