
హైదరాబాద్: ‘మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావ్’.. అనే రోజులు పోయినయ్.. ఇప్పుడు కరోనా పుణ్యమాని ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి’అంటున్నారు సిటీ జనం. సెకండ్ వేవ్తో గ్రేటర్ హైదరాబాద్లో కేసులు పెరుగుతుండటంతో కొందరు సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకుంటున్నారు. మల్కాజ్గిరిలోని ఓ మహిళ ఇలా ఇంటి గేటుకి బ్యానర్ ఏర్పాటు చేసుకుంది. దీన్ని చూసిన ఆ కాలనీ వాసులు సైతం వారి ఇండ్లకు బ్యానర్లను పెట్టుకున్నారు. ఇది సోషల్మీడియాలో వైరల్గా మారటంతో సిటీలో చాలా మంది తమ ఇండ్ల గేట్లకు ఇలాంటి బ్యానర్లే కనిపిస్తున్నాయి.