ప్రియురాలిని హత్య చేసిన ఓ ప్రియుడు అదే రోజున తాను కూడా అత్మహత్య చేసుకున్నాడు. అత్మహత్య చేసుకునే ముందు తన ఫోన్ లో ఓ కోడ్తో సూసైడ్ లెటర్ రాశాడు. దీనిని డీకోడ్ చేసిన పోలీసులు ప్రియురాలి మృతదేహాన్ని గుర్తించారు. దీనికి పోలీసులకు దాదాపుగా నెలరోజుల సమయం పట్టింది. ఇంతకీ ఏంటీ ఈ క్రైం మిస్టరీ ఏంటంటే..
ముంబైకి చెందిన వైష్ణవి బాబర్, వైభవ్ బురుంగలే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో కూడా తెలిసింది. కానీ ఇద్దరు కులాలు వేరు కావడంతో పెళ్లికి నో చెప్పారు. దీంతో వైభవ్ కు దూరంగా ఉండటం మొదలుపెట్టింది వైష్ణవి. దీనిని వైభవ్ తట్టుకోలేకపోయాడు. పైగా వైష్ణవిని అనుమానించాడు. తనకు దక్కనిది ఎవరికి దక్కకూడదని అనుకున్న వైభవ్.. వైష్ణవిని చంపేయాలని ఫిక్స్ అయ్యాడు.
2023 డిసెంబర్ 12న కలుద్దామని చెప్పి వైష్ణవిని ఖర్ఘర్ హిల్స్ వద్దకు రమ్మన్నాడు వైభవ్ . అక్కడ ఆమె గొంతు కోసి చంపేశాడు. అదే రోజున ఓ రైలు కింద పడి వైభవ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో వైష్ణవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుుకున్న పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు.
ఈ క్రమంలో వైభవ్ ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులకు తెలిసింది. అతడి మొబైల్ ఫోన్లో ఉన్న సూసైడ్ నోట్ను పరిశీలించారు. ఆ నోట్లో ‘ఎల్01-501’ వంటి కొన్ని కోడ్లు ఉన్నాయి. ముందుగా పోలీసులకు ఇది అర్థం కాలేదు. కాల్ రికార్డులు, సీసీ రికార్డుల ఆధారంగా వైష్ణవి, వైభవ్ చివరి సారిగా ఖార్ఘర్ హిల్స్ ప్రాంతంలో కనిపించనట్లుగా గుర్తించారు.
దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో వెతికారు. డ్రోన్లు కూడా వినియోగించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కోడ్ గురించి గుగూల్ లో కూడా సెర్చ్ చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరగా అటవీ శాఖ అధికారులను సంప్రదించగా అది ఆ ప్రాంతంలోని చెట్ల సీరియల్ నెంబర్స్ అని తేలింది. దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా చెట్టు పొదల వద్ద కుళ్లిన స్థితిలో ఉన్న వైష్టవి మృతదేహాన్ని గుర్తించారు. కాలేజీకి వెళ్లినప్పుడు ఆమె వేసుకున్న దుస్తులు, చేతి గడియారం, ఐడీ కార్డు ఆధారంగా మృతదేహాన్ని కనుగొన్నారు. 34 రోజుల తరువాత పోలీసులు ఈ కేసును చేధించారు.