
న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, యూఎస్ టారిఫ్లతో సంబంధం ఉన్న అప్డేట్స్, ఇతర గ్లోబల్ ట్రెండ్స్ వంటి అంశాలను గమనిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయొచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ యాక్టివిటీ, క్రూడ్ ఆయిల్ ధరలపై కూడా ట్రేడర్లు ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు.
“ఈ వారం భారత్, అమెరికా నుంచి కీలక ఆర్థిక డేటా విడుదలవుతుంది. ఇవి మార్కెట్ సెంటిమెంట్ను, సెంట్రల్ బ్యాంక్ అంచనాలను ప్రభావితం చేయొచ్చు. భారత్లో జూన్ 30న మే నెల ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఏడాది లెక్కన) డేటా విడుదలవుతుంది. జులై 1న జూన్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా రిలీజ్ అవుతుంది. ఇది భారత ఇండస్ట్రియల్ సెక్టార్ పరిస్థితిని, ఆర్డర్ ఇన్ఫ్లోలను చూపిస్తుంది.
జులై 3న సర్వీసెస్ పీఎంఐ వస్తుంది” అని బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ ఓ స్టేట్మెంట్లో తెలిపింది. గత వారం మిడిల్ ఈస్ట్లో జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గడం, క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పడిపోవడం వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,650.73 పాయింట్లు (2శాతం), నిఫ్టీ 525.4 పాయింట్లు (2శాతం) లాభపడ్డాయి. “మొదటి త్రైమాసిక ఆదాయాల సీజన్ దగ్గరపడుతుండటంతో ఇన్వెస్టర్లు కంపెనీల ఫలితాలపై దృష్టి పెడుతున్నారు.
అమెరికా ఈ వారం ప్రధాన గ్లోబల్ భాగస్వాములతో ట్రేడ్ ఒప్పందాలను ఫైనల్ చేయొచ్చని ఆశలు ఉన్నాయి. అలాగే యూఎస్ నాన్-ఫార్మ్ పేరోల్, అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఈ వారం వెలువడనుంది. భారత్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వంటి కీలక ఆర్థిక సూచికలను మార్కెట్ గమనిస్తోంది. ఇవి దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక రికవరీని అంచనా వేయడానికి సహాయపడతాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ మెరుగవడం, యూఎస్, -ఇండియా ట్రేడ్ డీల్ అవకాశాల వల్ల మార్కెట్కు మద్దతు దొరుకుతుందని అంచనా.