ఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నరు?

ఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నరు?

వ్యవసాయ శాఖ చెప్పిన విషయం నిజమైతే దేశ ప్రజలకు ఆ వివరాలు అందించవల్సిందిగా పీఎంవో ఇండియాను అభ్యర్థిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీని గుర్తు చేస్తూ కేటీఆర్... ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా  రైతుల ఆదాయం రెట్టింపైందన్న కేంద్ర వ్యవసాయ శాఖ ట్వీట్ చేసిన పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ మంత్రి కొన్ని ప్రశ్నలను సంధించారు. అవేమిటంటే, 

1) ఎన్ని లక్షల మంది రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారు?
2) ఈ రైతులు ఏ రాష్ట్రానికి చెందినవారు?
3) దీనిని సాధించడానికి ప్రభుత్వ ఏం చొరవ తీసుకుంది ?

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అందులో భాగంగా చాలా మంది రైతులు ఇప్పటికే వారి ఆదాయాన్ని డబుల్ చేసుకున్నారని చెప్తూ.. ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ రకమైన ప్రశ్నలను సంధిస్తూ.. కేంద్రాన్ని నిలదీశారు.