Beauty Tips: పాదాల పగుళ్లు పోవాలంటే.. ఇంట్లోనే ఉండి ఇలా చేయొచ్చు

Beauty Tips:  పాదాల పగుళ్లు పోవాలంటే.. ఇంట్లోనే ఉండి ఇలా చేయొచ్చు

చలికాలంలో ఎక్కువగా పాదాలకు పగుళ్లు వస్తాయి.  పాదాల పగుళ్లు వచ్చినప్పడు.. అవి విపరీతంగా నొప్పి పెట్టడం, రక్తం కారడం వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ పగుళ్లను నయం చేసుకునేందుకు రకరకలా క్రీములు, మందులు వాడుతుంటారు. ఆ సమస్య నుంచి బయటపడాలంటే... ఇంట్లోనే ఉండి ఇలా చేసి చూడండి.

• రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి.
• పెరుగు, వెనిగర్ ని సమానంగా కలపాలి. ఈ మిశ్రమంతో పాదాలను పావుగంట మసాజ్ చేస్తే పగుళ్లు పోతాయి.
• అరటి పండుని గుజ్జులా చేసి పగుళ్లున్న చోట రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగితే కాళ్లకి సరిపడా తేమ అంది పగుళ్లు       మాయమవుతాయి.
• నువ్వుల నూనెలో రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ కలిపి పాదాలకు మసాజ్ చేస్తే పగుళ్లు తగ్గుతాయి.
• కొబ్బరి నూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు పట్టిస్తే పగుళ్ల బాధ తగ్గుతుంది. 
• గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ వేయాలి. అందులో కాసేపు పాదాలు ఉంచి మసాజ్ చేసినా ఫలితం ఉంటుంది.
• ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. కాసేపటి తర్వాత చన్నీళ్లతో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే పగుళ్లు ఇబ్బంది     పెట్టవు.
• హ్యాండ్ క్రీమ్ నిమ్మరసం కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి.

ALSO READ :Good Health: రోజూ కాపీ తాగుతున్నారా.. అయితే, మీ జ్ఞాపకాలు పదిలం