కొత్త ల్యాప్ట్యాప్స్ ని లాంచ్ చేసిన హెచ్పీ

కొత్త ల్యాప్ట్యాప్స్ ని లాంచ్ చేసిన హెచ్పీ

హెచ్​పీ తన పెవిలియన్ ఎక్స్​360,  పెవిలియన్ ప్లస్ సిరీస్ ల్యాప్‌టాప్‌లను మంగళవారం భారతదేశంలో లాంచ్​ చేసింది. కంపెనీ ప్రకటించిన కొత్త ల్యాప్‌టాప్‌లలో హెచ్​పీ 15 (2023), హెచ్​పీ పెవిలియన్ ఎక్స్​360 (2023),  హెచ్​పీ పెవిలియన్ ప్లస్ 14 (2023) ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు తేలికగా, నాజూగ్గా ఉంటాయి. హెచ్​పీ పెవిలియన్ ఎక్స్​360 మోడల్ 360-డిగ్రీల  హింజ్​తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్స్​లో 12వ,  13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్​ ఉంటాయి.  ఫింగర్‌ప్రింట్ రీడర్‌, మాన్యువల్ కెమెరా షట్టర్‌ వంటి సదుపాయాలూ ఉంటాయి. ధరలు రూ.58 వేల నుంచి మొదలవుతాయి.