న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు మొదలైన 36 గంటల్లోనే టైర్2,3 పట్టణాల నుంచి డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రకటించింది. మొత్తం కస్టమర్లలో వీరి సంఖ్యే 75 శాతం వరకు ఉంది. అమెజాన్ ఫెస్టివల్సేల్ను ఈ నెల 23న మొదలుపెట్టింది. అమెజాన్ అందజేసిన డేటా ప్రకారం.. పండుగ సీజన్ సేల్లో మొదటి 36 గంటల్లోనే ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు 10 లక్షల ఉత్పత్తులను అమ్మాయి. ప్రైమ్ మెంబర్షిప్లు పోయిన ఏడాది కంటే 1.9 రెట్లు పెరిగాయి. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు తమ కస్టమర్లకు అనేక రకాల ప్రొడక్టులను అందిస్తున్నారని అమెజాన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. కస్టమర్లు ఎక్కువగా శామ్సంగ్, వన్ప్లస్, ఎంఐ, ఎల్జీ, సోనీ బ్రాండ్లను ఇష్టపడుతున్నారని అన్నారు. సేల్ సందర్భంగా అమెజాన్ బిజినెస్ సెగ్మెంట్ సేల్50 శాతం గ్రోత్ సాధించిందని ఆయన అన్నారు. అమెజాన్ ఇండియా ప్రైమ్ మెంబర్లకు భారతదేశంలోని 50 కిపైగాప్రధాన నగరాలకు, పట్టణాలకు సేమ్డే డెలివరీలను అందిస్తోంది. ఈ సంవత్సరం సూరత్, మైసూరు, మంగళూరు, భోపాల్, నాసిక్, నెల్లూరు, అనంతపురం, వరంగల్ వంటి 50 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో వచ్చాయి.
26 నుంచి యాపిల్ సేల్
యాపిల్ 'లిమిటెడ్ పీరియడ్ ఆఫర్' సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అందుబాటులో ఉండే డీల్స్ గురించి మాత్రం వెల్లడించలేదు. ఐఫోన్ 12, 12 మినీ ఫోన్లు కొన్నవారికి పోయిన ఏడాది ఎయిర్పాడ్స్ను బహుమతులుగా అందించింది. ఈసారి ఐఫోన్ 13 బయర్లకు ఇదే ఆఫర్ను అందించే అవకాశం ఉంది. 2021 సెప్టెంబరులో 13 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. దీని స్టార్టింగ్ ప్రైస్ రూ.80 వేలు కాగా, ఐఫోన్ 14 అందుబాటులోకి రావడంతో ధరను రూ.70 వేలకు తగ్గించింది. ఫ్లిప్కార్ట్ ఐఫోన్13ని రూ.57,900 లకు అమ్ముతోంది. పాత ఫోన్లను ఎక్స్చేంజి చేసుకుంటే రూ.16,900 వరకు ఇస్తున్నారు.