NTPC నుంచి BHELకు భారీ ఆర్డర్

NTPC నుంచి BHELకు భారీ ఆర్డర్

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)​కు నేషనల్​ థర్మల్ ​పవర్ ​కార్పొరేషన్​(ఎన్​టీపీసీ) నుంచి రూ.13,500 కోట్ల విలువైన భారీ ఆర్డర్​ దక్కింది. తెలంగాణ స్టేజ్​-2 థర్మల్​ పవర్​ ప్రాజెక్టు మెయిన్​ ప్లాంట్ ​ప్యాకేజీ కోసం ఈ ఒప్పందం కుదిరింది. 

2,400 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు భెల్​ బిడ్డర్​గా నిలిచింది. ఎన్​టీపీసీ నుంచి ఆదివారం నోటిఫికేషన్​ ఆఫ్​ అవార్డు అందుకుంది. ఇందులో మూడు 800 మెగావాట్ల యూనిట్ల డిజైన్​, ఇంజనీరింగ్​, తయారీ, సరఫరా, టెస్టింగ్​ పనులు ఉంటాయి.